1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''ఐటం సాంగ్‌''లో నర్తించనున్న ''బాపు బొమ్మ''

FileFILE
"సుందరాకాండ" చిత్రంలో బాపు బొమ్మగా కనిపించిన అందాలనటి ఛార్మీ.. తాజాగా ఓ ఐటం సాంగ్‌లో నర్తించేందుకు అంగీకరించింది. హిందీ చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ' అనే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛార్మీ తన అందాలను ఆరబోయనుంది. ఈ చిత్రంలో తరుణ్, ఇలియానాలు ప్రధాన పాత్రలను పోషించనున్నారు. ఈ ఐటం సాంగ్‌ కోసం ఆమె 25 లక్షల రూపాయల పారితోషకాన్ని స్వీకరించనుంది. తెలుగు చిత్ర సీమలో ఒకే ఒక ఐటం సాంగ్‌కు ఇంత భారీ మొత్తంలో పారితోషకాన్ని ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కావడం.

లోగడ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి "తోడు దొంగలు" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. గతంలో 'మహా మహా...' అంటూ సాగే పాప్ తరహా పాటలో ఛార్మీ చిందులువేసి యువతను 'మంత్ర'ముగ్ధులను చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా ఛార్మీ 'సుందరాకాండ' చిత్రం తర్వాత వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'చింతకాయల రవి' చిత్రంలో ఛార్మీ హీరోయిన్‌గా ఎంపికైంది.

హిందీ భాషలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యలు కలసి చేసిన కజరారే.. కజరారే అనే పాటను తెలుగులో జగపతిబాబు, తరుణ్, ఛార్మీలపై వచ్చే నెల ఆరో తేదీ నుంచి చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సినిమా సెట్ వేశారు.
About Writer
PNR