1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జులైలో అభి-ఐష్‌ ప్రపంచ పర్యటన

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో వారు ముగ్గురు అత్యంత పేరున్న సెలబ్రిటీలు. ఏదైనా కార్యక్రమానికి వారు
FileFILE
బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో వారు ముగ్గురు అత్యంత పేరున్న సెలబ్రిటీలు. ఏదైనా కార్యక్రమానికి వారు వస్తున్నారంటే.. అక్కడ వుండే హంగామా అంతా ఇంతా కాదు. మరి అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆ కుటుంబం ఒకేసారి ప్రపంచ పర్యటనకు బయలుదేరుతారని ఊహాగానాలు వస్తే.. దానికి మీడియాలో లభించే ప్రచారం అంతాఇంతా కాదు. కానీ అదే నిజమైతే. ఎస్.. నిజమే. బాలీవుడ్‌ బిగ్ "బి" అమితాబ్, జూనియర్ బిగ్ 'బి', ప్రపంచ మాజీ విశ్వసుందరి ఐష్‌లు ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు బయలుదేరనున్నారు.

ఈ పర్యటన వచ్చే జులై నెలలో సాగనుంది. అమితాబ్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు మాత్రం.. ఫ్రెండ్లీ అప్పీరెన్స్‌గా ఈ పర్యటనలో పరిమితం కానుంది. ఈ పర్యటనపై ఐష్ మాట్లాడుతూ.. గత రెండేళ్ళ క్రితం దుబాయ్‌లో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో "కజరారే కజరారే" పాటకు ఒకే వేదికపై నృత్యం చేయడం జీవితంలో మరచిపోలేని ఘటన. మేము ముగ్గురం కలసి ఇచ్చే ప్రదర్శన కంటే మించిన మరొక షో ఏదీ వుండబోదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లు పాల్గొనున్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి