1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఓల్డ్‌సిటీ నేపథ్యంలో... ''దత్తు''

1980నాటి హిందూ ముస్లిం గొడవలను ప్రధానాంశంగా తీసుకుని ఎన్.ఎస్.ఆర్ క్రియేషన్స్ బేనర్‌లో 'దత్తు'
WD PhotoWD
ఓల్డ్‌సిటీ అనగానే మతకలహాలు గుర్తుకువస్తాయి. 1980నాటి హిందూ ముస్లిం గొడవలను ప్రధానాంశంగా తీసుకుని ఎన్.ఎస్.ఆర్ క్రియేషన్స్ బేనర్‌లో 'దత్తు' సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇందులో సంజయ్, నందిని, నిషాపటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.వి.రెడ్డి, శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గురువారం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు మల్లిఖార్జునరావు క్లాప్ కొట్టగా, విజయబాపినీడు కెమేరా స్విచ్చాన్ చేశారు. రేమాండ్స్ వ్యాపారవేత్త హమీద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 1980నాడు మతకలహాల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు.

ఈ చిత్రంలో హీరోకు ఇద్దరు తండ్రులున్నా తల్లిని ఏమాత్రం తప్పు పట్టే విధంగా లేకుండా పాజిటీవ్‌వేలో చిత్రీకరించామన్నారు. ఇంకా రాజకీయనాయకులు యూత్‌ను ఎలా ఉపయోగించుకున్నారనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో పొందుపరిచామన్నారు.

రెగ్యులర్ షూటింగ్ మార్చి 7 నుంచి ప్రారంభించి, జూన్‌లో విడుదల చేయనున్నామన్నారు. 'జల్సా' సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయమైన సంజయ్... 'దత్తు' ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. మిస్ ఎపి 2007గా ఎంపికయిన హీరోయిన్‌ నందిని ఈ చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్, నాజర్, శరత్‌బాబు, గొల్లపూడి, బాబూమోహన్, పూజిత, సుమన్‌ శెట్టి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యాం, సంగీతం: శ్రీరాం, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.ఎస్.రెడ్డి.
About Writer
Hanumantha Reddy