1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"జల్సా" ఆడియోను ఆవిష్కరించిన మెగాస్టార్

పవన్ కళ్యాణ్
FileFILE
పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటించిన "జల్సా" చిత్రం ఆడియోను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం తొలి క్యాసెట్‌ను తన కుమారుడు రామ్‌ చరణ్ తేజ‌కు అందజేశారు. ఈ సందర్భంగా.. చిత్ర హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముక్తసరిగా మూడుముక్కలు అన్నట్లుగా రిలీజ్ తర్వాత మాట్లాడతానని పవన్ చెప్పగానే, మెగాస్టార్ మాట్లాడాలని పట్టుబట్టారు.

దీంతో ఇలా భయపెట్టి మాట్లాడమనడం తప్పు అంటూ చమత్కరించి ఇలా మాట్లాడారు. 'బంగారం' షూటింగ్‌లో ఉండగానే త్రివిక్రమ్ కథ చెప్పారు. అందులో ఒక సీన్ బాగా నచ్చింది. దాన్ని కథగా మార్చమని చెప్పాను. ఆయన మానవత్వం ఉన్న మనిషి, అదే నన్ను చాలా సన్నిహితంగా చేసింది. ఇటువంటి దర్శకులు పరిశ్రమకు చాలా అవసరం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

బాధగా వుంది: చరణ్
జల్సా ఆడియో పాటలు అపుడే ఇంటర్నెట్‌లలో వినిపించడం బాధాకరంగా వుంది. ఇలా ముందుగానే ఇంటర్నెట్ కేంద్రాల్లో వినిపిస్తాయని తాము
FileFILE
ఊహించలేదన్నారు. అయినప్పటికీ.. ఈ చిత్రం ఆడియో మంచి హిట్ అవుతుందని చిరుత ధీమా వ్యక్తం చేశాడు.

మళ్ళీ చేయాలనుంది: త్రివిక్రమ్
పవన్‌గారికి కథ చెప్పాను. బాగా నచ్చింది. అలాగే దేవీశ్రీప్రసాద్‌కు కాస్త కథ చెప్పాను. వెంటనే 'జల్సా' టైటిల్ సాంగ్ నాకు ఫోన్‌లోనే వినిపించారు. పవన్‌కిది సరైన కథ. అభిమానులు జల్సా చేసుకోవచ్చు. కొంతమందితో పరిచయం పరిచయంగానే మిగిలిపోతుంది. కొంతమందితో అలానే కంటిన్యూ చేయాలనిపిస్తుంది.

అంతబాగా మనిషి నమ్మే వ్యక్తి పవన్. ఆయనతో మళ్ళీ చిత్రం చేసేందుకు కథ చెప్పాలని ఉంది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాన్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇలియానా, పార్వతి మెల్టన్, అల్లు అర్జున్, అరవింద్, నాగబాబు, ఆలీ, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
About Writer
PNR