గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » వేసవిలో "మైఖేల్ మదన్ కామరాజు"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
అలనాడు పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన చిత్రం మైఖేల్ మదన్ కామరాజు. అదే పేరుతో తాజాగా ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్‌లు ప్రధాన పాత్రదారులుగా ఇదే పేరుతో ఓ చిత్రం నిర్మితంకానుంది. సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకుడు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన ఛార్మీ జంటగా నటిస్తోంది. ప్రభుదేవా, సునీల్, ఆశాశైనీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

దీనిపై దర్శకుడు మాట్లాడుతూ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. హాస్యరస ప్రధాన చిత్రమిది. కథకు తగిన పేరు. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, మల్లిఖార్జునరావు, ఎల్బీ.శ్రీరామ్, కొండవలస, కోవైసరళ, అభినయశ్రీ, కవిత, సంగీత, తులసి, అర్జన, రవళి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పాటలు.. భాస్కరభట్ల, కందికొండ, ఆర్ట్.. పేకేటి రంగా, ఫైట్స్.. రామ్ లక్ష్మణ్, నిర్మాతలు మన్నెం వెంకటరమణ, యోగేష్ పటేల్, రాజు-ప్రవీణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. నిధి ప్రసాద్.