అలనాడు పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన చిత్రం మైఖేల్ మదన్ కామరాజు. అదే పేరుతో తాజాగా ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్లు ప్రధాన పాత్రదారులుగా ఇదే పేరుతో ఓ చిత్రం నిర్మితంకానుంది. సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకుడు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన ఛార్మీ జంటగా నటిస్తోంది. ప్రభుదేవా, సునీల్, ఆశాశైనీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
దీనిపై దర్శకుడు మాట్లాడుతూ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. హాస్యరస ప్రధాన చిత్రమిది. కథకు తగిన పేరు. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, మల్లిఖార్జునరావు, ఎల్బీ.శ్రీరామ్, కొండవలస, కోవైసరళ, అభినయశ్రీ, కవిత, సంగీత, తులసి, అర్జన, రవళి తదితరులు నటిస్తున్నారు.