1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరు, బాబు కలవబోతున్నారా...?

చిరంజీవి చంద్రబాబు నాయుడు రజనీకాంత్ కుచేలుడు
WD
మెగాస్టార్ చిరంజీవి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నారా...? అనే సందేశం రజనీకాంత్ కుచేలుడు ప్రారంభోత్సవంలో కలిగింది. మొదటినుంచి రజనీకాంత్‌ను పొగుడుతూ ఉన్న చంద్రబాబు... చిరు గురించి మాట్లాడుతూ... చిరుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనీ, చాలాకాలం నుంచి కలిసి పనిచేస్తున్నామనీ వ్యాఖ్యానించారు. దీంతో కలిసి పనిచేయటం అనేది రాజకీయంగానా...? అనేది అక్కడ చర్చనీయాంశమైంది.

ఏదేమైనా చిరంజీవి రాజకీయ ప్రవేశంపై వివిధ పార్టీలు తమతో కలిసి రావాలని తమ అభిప్రాయాలు చెప్పినా... చంద్రబాబు మాత్రం ఇప్పటివరకూ దానిపై నోరు మెదపలేదు. కానీ కార్యక్రమంలో బాబు మాట్లాడిన తీరును చూస్తే వారిద్దరూ కలిసి పనిచేస్తారేమో అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరంజీవికి చంద్రబాబుకు ఎప్పటినుంచో మంచి సంబంధాలున్నాయి. గతంలో విజయవాడ లోక్‌సభ సీటును చిరు రికమెండేషన్‌పై అశ్వనీదత్‌కు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. దాంతో చిరు అభిమానులే అశ్వనీదత్‌ను ఓడించటం విశేషం. ఇటీవలే అంటే... గత శుక్రవారం నాడు కోస్తాంధ్ర తెలుగుదేశం నాయకుడు చిరు మా పార్టీలో కలిసి వస్తే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రకటించటం విశేషం.

విజయవాడలో చిరు కటౌట్లు ధ్వంసం...
ఇదిలా ఉండగా విజయవాడలోని కృష్ణలంకలో ఆదివారంనాడు చిరంజీవి కటౌట్లు కొన్నిచోట్ల డామేజ్ అయి ఉన్నాయి. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కటౌట్ల కట్టారు. దీంతో అక్కడ చిరు అభిమానులు అధ్యక్షుడు నాయుడు పెద్ద గందరగోళం సృష్టించి కాంగ్రెస్‌వారే ఇలా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవి యాదృశ్చికంగా జరిగాయా? ఎవరైనా చేశారా? అనేది పోలీసులు చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT