1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

28న పాక్‌లో "తారే జమీన్ పర్" విడుదల

భారతీయ జనతా పార్టీ అగ్రనేత
FileFILE
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లాల్‌ కృష్ణ అద్వానీని కంట తడపెట్టించిన "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానునంది. ఈ చిత్రంతో పాటు.. "రేస్" సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు యూటీవీ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. దీనిపై యూటీవీ మార్కెటింగ్ విభాగ ప్రతినిధి మాట్లాడుతూ.. 'తారే జమీన్ పర్' చిత్రానికి పాకిస్థాన్ సెన్సార్ బోర్డు యూనివర్సల్ సర్టిఫికేట్ (యు)ను జారీ చేసిందన్నారు. ఈ చిత్రానికి ఎక్కడా కూడా సెన్సార్ కత్తెర పడలేదని చెప్పారు.

అలాగే.. 'రేస్' చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చిందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్‌లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో నగరంలో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. యూటీవీ గతంలో "గోల్" అనే చిత్రాన్ని విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ చిత్రాలు పాకిస్థాన్‌ ప్రేక్షకులను తప్పకుండా ఆలరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
About Writer
PNR