భూమిక కథానాయికగా నటిస్తున్న మల్లెపూవు చిత్రాన్ని వి. సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని దర్శకులు చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ... 'డిజైనర్ రమేష్ వర్మ అందించిన కథ ఇది. ఇందులో భూమిక పోషించే పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. హార్ట్ టచ్తో కథలో మలుపులు ఉంటాయి. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా మురళి హీరోగా పరిచయం అవుతున్నారు' అని చెప్పారు.