సంచలన వ్యాఖ్యలు చేసిన ఆశాషైనీ
|
నటుడు మోహన్ బాబు వ్యక్తిగత కార్యదర్శి అయిన వెంకటరెడ్డి తనకు వీసా ఇప్పించాడని వెల్లడించింది. తనకు తెలియకుండా శ్రీలత అనే పేరును కూడా జతచేశాడని పేర్కొంది. ఇలా పరిశ్రమలోని చాలా మందికి వీసాలు ఇప్పించాడని తెలిపింది. ఈ వార్తల వెలుపడటంతో హైదారాబాద్ ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా విదేశాల్లో షూటింగ్ జరపాలంటే ముఖ్యంగా.. మహిళలను అధిక సంఖ్యలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అందువల్లే వివిధ పేర్లతో వెంకట రెడ్డి నకిలీ పాస్ పోర్టులు సిద్ధం చేసి పలువురు మహిళలను విదేశాలకు తరలించి ఉంటారనే సందేహం పోలీసులకు కలిగింది. దీంతో ఆయన వద్ద విచారించాలని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. సెంటిమెంటుతో సినీ ప్రముఖులు తమ పేర్లను మార్చుకుంటుంటారు. ఆ కోవలోనే నకిలీ పాస్ పోర్టు కేసులో అరెస్టైన ఆశాషైనీ తాజాగా తన పేరును మయూరిగా మార్చకుంది.