ఫారెస్ట్ నేపథ్యంలో ''పల్లవి'' ప్రారంభం
|
ఈ చిత్రంలో నర్సింగ్ యాదవ్, మహేష్యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తాజాగా విడుదలైన మంత్ర, అనసూయ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమని తెలిపారు. చిత్రం కథ మొత్తం అడవిలోనే జరుగుతుందని ఆయన వివరించారు.
షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా- శ్రీరామ్, సంగీతం- మోహన్, కూర్పు- శ్రీనివాస్, కథ, మాటలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం- రాజేష్ పుప్పాల.