ఐటంసాంగ్ల నుంచి హీరోయిన్ స్థాయికి చేరుకున్న ముమైత్ఖాన్కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముమైత్ఖాన్ ప్రధాన పాత్రతో పలు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఇదేకోవలో ముమైత్ ప్రధానపాత్రలో నటించనున్న ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలో పి. శ్రీనివాస్చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూబ్లిహిల్స్లోని సాయిబాబా టెంపుల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముమైత్ఖాన్పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు దర్శకుడు చంద్రమహేష్ క్లాప్ ఇవ్వగా, కాజా సూర్యనారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నామని ఆయన వివరించారు.
ముమైత్ఖాన్ మాట్లాడుతూ గతంలో యాక్షన్ చిత్రాల్లో నటించానని, ఈ చిత్రంలో ఓ సాదాసీదా అమ్మాయిగా నటించనున్నానని తెలిపారు. హావభావాలు పలికించడానికి వీలున్న పాత్ర ఈ చిత్రంలో తాను పోషిస్తున్నానని ఆమె చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా- ప్రభు, మాటలు- వై.ఎస్. కృష్ణేశ్వరరావు, వరికూటి శివప్రసాద్, రచనా సహకారం- మండెపుడు పూర్ణ, సంగీతం- కృష్ణసాయి, సమర్పణ- మాస్టర్ రామ్తేజేశ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం- చెరుకూరి సాంబశివరావు.
|