పాట పాడుకుంటున్న ''పున్నమినాగు''
|
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ జరపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రంలో భావోద్వేగాలకు పెద్దపీట వేశామన్నారు. యండమూరి వీరేంద్రనాధ్ రచన ఈ చిత్రం కథకు ఆధారమని ఆయన తెలిపారు.
దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన పున్నమినాగు చిత్రం తరహాలోనే ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ఎమ్మెస్ నారాయణ, సాజిత్ఖాన్ నటిస్తున్నారు. ఎస్.ఏ. రాజ్కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.