18న అద్వానీ ఆవిష్కరించనున్న ''శ్రీరామ మందిర్''
|
దీనిపై నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ.. 'శ్రీరామ మందిర్' ఆడియోను ఈనెల 18వ తేదీన ఢిల్లీలోని శ్రీఫోర్ట్లో అద్వానీ విడుదల చేస్తారని చెప్పారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ఆ రోజే చిత్ర ప్రివ్యూను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. తాను నిర్మించిన చిత్రం ఆడియోను ఒక గొప్ప రాజకీయనాయకుడు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వచ్చే జులైలో విడుదలకు నోచుకోనున్న ఈ చిత్రం భోజ్పురి, గుజరాతీ, మలయాళం, తమిళ భాషల్లోకి అనువాదం చేసినట్టు చెప్పారు. ఈ ఆరు భాషల్లో చిత్రానికి వచ్చే స్పందన చూశాక, మరో 16 భాషల్లోకి అనువదించేందుకు కృషి చేస్తామన్నారు. తమిళంలో 'రామాలయం' పేరుతో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.