రవితేజ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న తాజా చిత్రం "నేనింతే". శియా హీరోయిన్గా పరిచయమవుతోంది. బుధవారంనాడు సంస్థ కార్యాలయంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ముహూర్తపుషాట్ చిత్రీకరించారు. దీనికి దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి. వినాయక్ గౌరవదర్శకత్వం వహించారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభమవుతుందని, రవితేజ, తన కాంబినేషన్లో వచ్చిన చిత్రాలకోవలోనే ఉంటూ వైవిధ్యంగా ఉంటుందని పూరీ జగన్నాథ్ చెప్పారు. యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా... శ్యామ్, కె. నాయుడు, సంగీతం... చక్రి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్... రాజారవీంద్ర.
|