పాండురంగడు చిత్రంలో తన అందాలను ప్రేక్షకుల ముందు ఆరబోసిన టబు డబ్బు ఇస్తే ఎటువంటి పాత్రనైనా నటిస్తానంటోందట. చిన్నా చితకా హీరోలకు జతగా నటించటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ చెపుతోంది.
చెప్పిందే తడవుగా తాజాగా జె.ఎం క్రియేషన్స్ పతాకంపై ఫైట్ మాస్టర్ విక్కీ దర్శకత్వంలో రూపొందుతోన్ని 'జైలర్' చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోంది. పాట ఫేమ్ మధుసూదన్ హీరోగా నటిస్తుండగా, ముంబైకు చెందిన పాయల్ శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
|