హీరో రాజశేఖర్, హీరోయిన్లు నీతూచంద్ర, సంజన, షరిల్పింటోలు నటిస్తున్న కొత్త చిత్రం 'సత్యమేవ జయతే'. ఈ చిత్రం ప్రారంభోత్సం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా శనివారం రాత్రి జరిగింది. ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రావు, హీరో రాజశేఖర్లపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్కు వైఎస్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత టి.సుబ్బిరామి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కూడా పాల్గొన్నారు. సిరిమీడియా సమర్పిస్తున్న ఈ చిత్రానికి కెమెరా..లోకి, వంశీ, సంగీతం.. ఎస్.చిన్న, రైటర్స్.. గంగోత్రి విశ్వనాథ్, రైటర్ మోహన్, ఫైట్స్.. హార్స్మెన్ బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. రీనా శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే... డాక్టర్ రాజశేఖర్, దర్శకత్వం.. జీవిత రాజశేఖర్, నిర్మాతలు.. శివాజీ, శివాత్మిక, సమర్పణ.. సిరి మీడియా, శివానీ, శివాత్మిక మూవీస్.
|