అనంతపురం జిల్లా తాడిపత్రిలో "కంత్రి" సినిమా టిక్కెట్ల కోసం ఏర్పడిన తోపులాటలో ఎన్టీఆర్ అభిమాని ఎన్. ప్రసాద్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమాని ప్రసాద్ తల్లిదండ్రులు విమలమ్మ, సుధాకర్లకు జూనియర్ ఎన్టీఆర్ లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని ఇటీవల అందించారు.
కొడాలి నాని సమర్పణలో వైష్టవి ఆర్ట్స్ బేనర్లో ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్న వంశీమోహన్ కూడా మరో లక్షరూపాయల చెక్ అందించారు. ఎన్టీఆర్ నటించిన "కంత్రి" సినిమా రిలీజ్ రోజున రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లలో అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడిన సంగతి తెలిసిందే.
|