శివాజీ హీరోగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిర్మితవుతోంది. ఈ సినిమా పేరు "ఇందుమతి". జియో మీడియా ఆర్ట్స్ పతాకంపై హర్షారెడ్డి స్వీయదర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివాజీ "విలన్" పాత్రను పోషిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రమైన ఈ మూవీలో శివాజీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఛార్మీ నటించిన "మంత్ర"లో కీలక పాత్ర పోషించిన శివాజీ ఈ విషయమై మాట్లాడుతూ... హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కానని, సినీ పరిశ్రమలో ఆల్రౌండర్గా పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందుకే తనకు వచ్చిన రోల్స్కు న్యాయం చేసేందుకు చూస్తానని చెప్పారు. ప్రస్తుతం శివాజీ నటించిన "మా ఆయన చంటి పిల్లాడు" విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజవన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
|