తెలుగు తెరపై హిట్ జంటైన మోహన్ బాబు- రమ్యకృష్ణ జోడీ మళ్ళీ రంగప్రవేశం చేయనుంది. "గొడవ" ఫేమ్ వైభవ్ హీరోగా నటించే తదుపరి చిత్రంలో రమ్యకృష్ణ హీరోకు మేనత్తగా నటించనుంది. యువమహిళ డైరక్టరైన భాను దర్శకత్వం వహించే ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో విలన్గా నటించనున్నారు. ఇదిలా ఉండగా, హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల "ఆవకాయ బిరియాని"లో నటించిన బిందు ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు. "గొడవ"కు సంగీతం సమకూర్చిన మణిశర్మ, వైభవ్ కొత్త చిత్రానికి కూడా బాణీలతో శ్రోతలను మెప్పించనున్నారు.
‘ఆవకాయ బిర్యానీ’ అనే పేరుతో శేఖర్ కమ్ముల ఒక చిత్రాన్ని నిర్మించనున్నారని, ఇందులో కూడా కొత్త ప్రతిభను పరిచయం చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా అవినాష్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. అవినాష్ గతంలో కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. దీనితో శేఖర్ కమ్ముల తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి శేఖర్ నిర్మాతగా మాత్రమే ఉండిపోయి దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించడం విశేషం.
|