విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ శ్రియ హీరోయిన్గా నటిస్తున్న "మల్లన్న" షూటింగ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుగుతోంది. భాగ్యనగరంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, మల్లన్న యూనిట్ విదేశాలకు ప్రయాణం కానుంది.
తెలుగులో "మల్లన్న" పేరుతో తెరకెక్కన్ను ఈ సినిమా, తమిళంలో "కందసామి" పేరుతో రానుంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు కళైపులి ధాను డైరక్షన్లో భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు వివరాలు తెలియజేస్తూ.. ఇటీవలే మల్లన్న ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నాడని చెప్పారు.
జూలై 23 నుంచి మెక్సికోలో "మల్లన్న" కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని చెప్పారు. ఫిల్మిం నగర్లోని రామోజీ ఫిలిం సిటీలో మల్లన్న షూటింగ్ ఓ వారం పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. వి. క్రియేషన్స్ బేనర్పై ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.
|