కార్తికేయ క్రియేషన్స్ పతాకంపై, మధుమురళీ నిర్మాత సారథ్యంలో తరుణ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంలో జరుగుతోంది. ఇంకా పేరు ఖరారు కానీ తరుణ్-జెనీలియా కొత్తచిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్లు పూర్తి చేసుకుందని సినీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా, కార్తికేయ క్రియేషన్స్, కృష్ణవంశీ కాంబినేషన్లో శ్రీకాంత్ హీరోగా నటించిన "ఖడ్గం" బంపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. రాజమండ్రి, అమరావతి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సినీమాటోగ్రఫీ... భాస్కర్, సంగీతం... విద్యాసాగర్, పాటలు... అనంత శ్రీరామ్.
|