సినిమాల్లోనే కాదు. నిజ జీవితంలోనూ సినీ నటులు రాష్ట్ర సుభిక్షంగా వుండాలనే హోమాలు నిర్వహించడం గమనార్హం. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఫిలిమ్ నగర్ సాయిబాబా ఆలయంలో వరుణహోమాన్ని నిర్వహించారు.
మోహన్ బాబు, నూకారపు సూర్యప్రకాశరావు, లగడపాటి శ్రీధర్, నరేష్, ఆలయ కమిటీ ఛైర్మన్ గౌతమ్ సిద్ధార్థతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకిష్టమైన సాయినాధుని ఆలయంలో పవిత్రమైన ఈ హోమాన్ని నిర్వహించడం, అందులో తానూ పాల్గొనడం ఆనందంగా ఫీలవుతున్నానని మోహన్ బాబు అన్నారు. చిరంజీవి జీవిత భాగస్వామి సురేఖ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|