ఇ.వి.వి మాట్లాడుతూ... నరేష్ నటించిన చిత్రాలకు కథలు వినడం మానేశానని, ఇప్పటి ట్రెండ్కు తమ ఆలోచనలు కరెక్టుగా ఉంటాయేలేదోన్న భయం ఉందన్నారు. ఈ కథమాత్రం తమను వినమని రచయిత సతీష్ చెప్పడన్నారు. విన్నతర్వాత కథ అద్భుతంగా ఉందని, అప్పటికే నిర్మాత బుక్ అయ్యాడని, లేకుంటే తామే చేద్దామనుకున్నామన్నారు.
లీలామహల్ సెంటర్లో దేవీ ప్రసాద్ బ్రంహ్మాండంగా తీసాడన్నారు. చిత్రంలో హాస్యాన్ని చక్కగా చూపాడన్నారు. తమ కన్నా ఈ చిత్రంలో హాస్యాన్ని చక్కగా చూపాడని అనుకుంటున్నాన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ... నరేష్ చూస్తుంటే ఆప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 10 చిత్రాలు తీస్తూ నిర్మాతల హీరోగా నిలిచాడని, ఆలాగే పిల్లల్లోకూడా నరేష్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడన్నారు. మరింత భవిష్యత్ఉందన్నారు.
చిత్ర దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ..... తమ గురువు కోడిరామకృష్ణగారు లేకపోతే తాము ఈ స్థానంలోకి వచ్చేవాడిని కాదన్నారు. ఇ.వి.వి గారు తమకు సక్సెస్ లేకపోయినా చిత్రాన్నిఇచ్చి ప్రోత్సహించారన్నారు. మంచి ఎంటర్టైనర్ చిత్రమిదన్నారు.
నటుడు నరేష్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రారంభంకావడానికి ప్రధాన కర్త తమ స్నేహితుడు ముద్దుకృష్ణని, ఆయనే నిర్మాతగా ఉండాల్సిందన్నారు. కానీ అంకితం పేరు వేసుకోవడం కాస్త మనస్సును కలచివేసిందని, ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. చిత్రం రష్ చూసి సూపర్ హిట్ అని ముద్దుకృష్ణ అన్నట్లే సక్సెస్ కానుందన్నారు. ఈ సందర్భంలో దేవీ శ్రీ ప్రసాద్తో డిసెంబర్లో మరోచిత్రంలో నటించనున్నారన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు ప్రథమార్థంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. |