ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించిన సంగీత సోదరుడు పరిమళ్ వెండితెరకు పరిచయం కానున్నాడు. "లేచిపోదామా" అనే చిత్రం ద్వారా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పరిమళ్ సరసన "ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య హీరోయిన్గా నటించనుంది.
వి. భరణి నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమాకు "నా ఊపిరి" ఫేమ్ కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ అమ్మాయో, అబ్బాయో లేచిపోతే ఏ మాత్రం అంగీకరించరనే కీలకాంశాన్ని ఆధారంగా తీసుకుని, విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నామని కన్మణి వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాలో హైదరాబాద్, ఊటీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోదని కన్మణి తెలిపారు.
|