శివబాలాజీ, ముమైత్ ఖాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "టార్గెట్" చిత్రం పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఆడియోను నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత సంగిశెట్టి దశరథ్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏమీ జరుగుతుందనే ఉత్సుకత ప్రేక్షకుడికి కల్గుతుందని, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోందని నిర్మాత వెల్లడించారు. కోటి సంగీత సారథ్యంలో పాటలు బాగా వచ్చాయని చెప్పారు.
చిత్ర దర్శకుడు రమేష్ రాజా మాట్లాడుతూ.. మర్డర్, మిస్టరీతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కనుందని, అయితే ఎక్కడా అసభ్యతకు తావే లేదని, క్రైం కథలు రాసే రచయిత్రిగా ముమైత్ విభిన్న పాత్ర పోషిస్తుందని వివరించారు. వైవిధ్యమైన స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చెప్పారు.
ఇందులో శివబాలాజీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటిస్తున్నారని రమేష్ రాజా చెప్పారు. ఇకపోతే ఈ సినిమాకు కెమెరా... .ఎన్.సురేష్ కుమార్, ఎడిటర్... కె. రమేష్, నిర్మాతలు... సంగిశెట్టి దశరథ్, బి. రామకృష్ణ.