"యువత" ఆడియో ఆవిష్కరణ
|
అనంతరం పూరీ జగన్నాథ్ చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేసే క్లిప్పింగ్ను ప్రదర్శించారు. తన దగ్గర పరుశురామ్ పనిచేశారని, అందరూ కొత్తవారితో తీసిన ఈ చిత్రం తాను "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం" తీసిన రోజులను గుర్తు చేసిందని పూరీ వ్యాఖ్యానించారు.
చిత్రదర్శకుడు పరుశురామ్ మాట్లాడుతూ.. తొలుత పూరీ జగన్నాథ్, ఆ తర్వాత భాస్కర్ దగ్గర పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. యువత ఆలోచనలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని, లవ్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అంశాలతో సరికొత్త చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు హరి, ఉమాప్రకాష్ తెలిపారు. ఈ చిత్రం విజయవంతం కావాలని దిల్రాజు, భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.