1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కామెడీ ఎక్స్‌ప్రెస్‌లో "ఆశాసైనీ" అందాల ఆరబోత!

వినోదం వెండితెర కథనాలు టీవీ మీడియా పతాకం జితేంద్ర సమర్పణ
WD
టీవీ మీడియా పతాకంపై జితేంద్ర సమర్పణలో కె. శంకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "కామెడీ ఎక్స్‌ప్రెస్". ఈ సినిమాలో ముద్దుగుమ్మ ఆశాసైనీ అందాలను ఆరబోస్తుందట. ఆమె పోషించే గ్లామర్ పాత్రే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత వెల్లడించారు.

ఇకపోతే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు, మూడో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, అక్టోబర్‌లో పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చిత్ర దర్శకుడు శ్రీనివాస్ కస్తూరి తెలిపారు.

పూర్తి కామెడీతో రూపొందే ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సిద్ధం చేయనున్నామని నిర్మాత కె. శంకర్ రెడ్డి వెల్లడించారు. కౌశల్, శ్రీనివాసరెడ్డి, ఆషాశైని, సత్యంరాజేష్, ధర్మవరపు, బాబు మోహన్, దేవదాస్ కనకాల, వడివేలు, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు.