1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''వరుడు''గా వస్తున్న ''అతిథి''

తెలుగు వెండితెర 'అతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు 'వరుడు తెలుగు ప్రేక్షకుల 'పోకిరి తెలుగు వెండితెర
FileFILE
తెలుగు వెండితెరపై 'అతిథి'గా కనిపించిన ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో 'వరుడు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'పోకిరి' చిత్రంతో తెలుగు వెండితెర రికార్డులను తిరగరాసినా, 'అతిథి' చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో కనకరత్నా మూవీస్ పతాకంపై సింగమల రమేష్ బాబు నిర్మిస్తున్న తాజా చిత్రం 'వరుడు'. ఈ చిత్రం షూటింగ్ వచ్చే 16వ తేదీన రాజస్థాన్‌లో జరుగనుంది.

ఆ తర్వాత హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో మహేష్ బాబు సరసన.. పార్వతి మెల్టన్, తమన్నాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రంపై మహేష్ బాబు భారీ ఆశలనే పెట్టుకున్నారు. అడ్వెంచర్ లవ్ సెంటిమెంట్‌తో ఈ చిత్ర కథ సాగుతుందని, అందువల్ల ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
About Writer
PNR