గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » 90 శాతం పూర్తయిన "మొండి మొగుళ్ళు-పెంకి పెళ్ళాలు"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
సమస్య ఎంత చిన్నదైనా దాన్ని భూతద్దంలో చూస్తూ గొడవపడే భార్యాభర్తల మధ్య జరిగే కథతో "మొండి మొగుళ్ళు-పెంకి పెళ్ళాలు" రూపొందుతోంది. రఘుబాబు, శివాజీ రాజా మొగుళ్ళుగా నటిస్తున్నారు. హర్షిణిరెడ్డి సమర్పణలో మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్నారు. కె. రమణారావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మూడు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయిందని నిర్మాత తెలిపారు.

ఇంకా ఈ సినిమా విశేషాలను గురించి నిర్మాత మాట్లాడుతూ... తారాగణమంతా పాల్గొనగా, "జాబిల్లికి మా ఇంట షష్టిపూర్తి రోజంట" అనే పాటను చిత్రించామని, ఈ సినిమా పూర్తి వినోదభరితమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా మిళితమై తెరకెక్కనుందని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య ఉండే అపోహలే అయినా హాయిగా నవ్వుకునేట్లుగా కథను తయారు చేశామని, ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన పాటలను బ్యాంకాక్, సింగపూర్‌లలో చేయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, ఎం.ఎస్. నారాయణ, జీవా, బాబూ మోహన్, గిరిబాబు, శ్రీనివాసరెడ్డి, మధువన్, సుభాషిణి, గీతా సింగ్, శీతల్, రాఖీ, బాబిలోనియా తదితరులు నటిస్తున్నారు. కెమెరా... కళ్యాణ్ సమి, సంగీతం... సిద్ధు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... రమణారావు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు 90 శాతం మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు మూడో షెడ్యూల్