టాలీవుడ్ యూత్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రంలో అందాల సుందరీమణులు పార్వతీ మెల్టన్, తమన్నాలు హీరోయిన్లుగా నటించనున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్లో సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది.
కనకరత్న మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ప్రముఖ ఫైనాన్షియర్ సింగనామాల రమేష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
WD
ప్రిన్స్ నటించే ఈ కొత్త సినిమాలో హీరోయిన్ పాత్రలను పార్వతీ మెల్టన్, తమన్నాలు పోషిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇంకేముంది... యువరాజు సరసన నటించేందుకు మెల్టన్, తమన్నాలు " సై" అనాల్సిందే...