కామెడీ నటుడ్ని కథానాయకుడిగా చేసిన దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలను తీస్తూ అశ్లీతలకు తావు లేకుండా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఎస్వీకృష్ణారెడ్డి ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నారు. అలీ, శివాజీ, శ్రీనివాస రెడ్డి హీరోలుగా చేస్తూ ఓ కొత్క చిత్రానికి శ్రీకారం చుట్టారు.
గురువారం ఈ చిత్రం షూటింగ్ జూబ్లీహిల్స్లోని ఓ భవంతిలో ప్రారంభమైంది. చక్కని ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంట్ మిళితమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. లక్కీమీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.