సుధ తనయుడు హీరోగా "మమత"
|
అన్నై భవాని క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ డి.కె.కేశవరావు, కె. భారత్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ... మలయాళ చిత్రసీమలో సీనియర్ నటుడు మధు హీరో తాతగా నటిస్తున్నారని, హీరో తల్లిదండ్రులుగా భానుప్రియ, శరత్బాబు నటిస్తుండగా, చరణ్రాజు కూతురుగా హీరోయిన్ రూప నటిస్తోందని చెప్పారు.
తిరుపతి, తలకోన, కేరళలో షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ నెలలో ఆడియోను, అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రేమకథా చిత్రాలతో నవ్యత చోటుచేసుకుంటే ప్రేక్షాకాదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగానే ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు.
రెండు తరాల మధ్య "ప్రేమ" వల్ల ఏర్పడిన సంఘటనల సమాహారమే ఈ చిత్రమని దర్శకుడు చెప్పారు. కళ్యాణి, పల్లవి, చార్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... కృష్ణతేజ, కెమెరా... అరుణ్దాస్, సంగీతం... కార్తీక్ రాజ.