గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » పతాక సన్నివేశాల్లో "సాధు"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
నాగబాబు, అర్చన హీరోహీరోయిన్లుగా వినోద్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం "సాధు". లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎల్. వి. రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ... హీరో చుట్టూ కథ నడుస్తుందని, కథాంశం అందరినీ ఆలోచింపజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం మియాపూర్, రాజేంద్రనగర్ దేవాలయాల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు. ఇందులో మూడు పాటలు చంద్రబోస్ రాశారని, చిన్నా చక్కటి సంగీతాన్ని అందించారని చెప్పారు.

దర్శకుడు అంజి మాట్లాడుతూ... హీరోతో పాటు... అప్పుడే పుట్టిన పిల్లవాడి చుట్టూ నడిచే కథ ఇదని చెప్పారు. ఇందులో "సాధు" పాత్రధారిగా నాగబాబు వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్‌ మాసాంతానికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు.

కథానాయకుడు నాగబాబు మాట్లాడుతూ.... మంచి కథాంశంతో, చక్కని స్క్రీన్‌ప్లేతో అంజి తెరకెక్కిస్తున్నారన్నారు. అన్నిరకాల వాణిజ్య అంశాలతో నిర్మాత చక్కగా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.

డా. శివప్రసాద్, వల్లభనేని జనార్ధన్, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే....మల్లడి మోహనగాంధీ, మాటలు... వి.వి.వి దుర్గాప్రసాద్, ఆర్ట్.... నారాయణ రెడ్డి, కెమెరా, దర్శకత్వం....అంజి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు నాగబాబు అర్చన వినోద్కుమార్ ప్రత్యేక పాత్ర లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్