టర్కీ చిత్రోత్సవంలో "మిషన్ ఇస్తాంబుల్"
శుక్రవారం నుంచి దక్షిణ టర్కీలో ప్రారంభం కానున్న నాలుగవ ఇంటర్నేషనల్ యూరేషియా చిత్రోత్సవంలో సాహస ప్రాధాన్యంతో రూపొందిన హిందీ థ్రిల్లర్ మూవీ "మిషన్ ఇస్తాంబుల్" ను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవంలో భాగంగా 45వ గోల్డెన్ ఆరెంజ్ పిల్మ్ ఫెస్టివల్ను, ఫిలిం మార్కెట్ను కూడా నిర్వహించనున్నారు.
టర్కీలో సినిమా, ఆడియో వీడియో సంస్కృతికి ప్రతీక టర్శాక్ ఆధ్వర్యంలో ఈ చిత్రోత్సవాన్ని అక్టోబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అపూర్వ లతిక దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం "మిషన్ ఇస్తాంబుల్" ఆగస్టు నెలలో విడుదలైంది. ఈ చిత్రంలో జయేద్ ఖాన్, వివేక్ ఓబెరాయ్, శ్రియా శరణ్, షబీర్ అహ్లువాలియా, నికిటిని ధీర్ ప్రధాన తారాగణం కాగా శ్వేతా భరద్వాజ్ కొత్తగా పరిచయం అయారు. కాగా, సునీల్ షెట్టీ, అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు.
ఈ చిత్ర కథ ఉగ్రవాద నేపథ్యంలో కొనసాగుతుంది. తాను పనిచేస్తున్న ఇస్తాంబుల్ కేంద్రంగా నడిచే వార్తా ఛానెల్ వాస్తవానికి ఆప్ఘనిస్తాన్, భారత్లలో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంటోందని భారతీయ జర్నలిస్టు గ్రహిస్తాడు. తర్వాత అతడు ఈ ఉగ్రవాద సంస్థ పని పట్టడానికి టర్కిష్ కమాండోగా గతంలో పనిచేసిన ఓ మహిళ సహాయం తీసుకుంటాడు.
ఈ చిత్రోత్సవంలో ఆసియా తరపును ప్రదర్శించబడుతున్న ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల నుంచి పలు చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించబడనున్నాయి. కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ హస్త పతకాన్ని అందుకున్న ది క్లాస్, వూడీ అలెన్ నటించిన వికీ క్రిస్టినా బార్సెలోనా, చార్లీ కాఫ్మన్ తీసిన న్యూయార్క్ వంటి ప్రధాన చిత్రాలు కూడా ఇక్కడ పదర్శనకు వచ్చాయి.
టర్కీలో సినిమా, ఆడియో వీడియో సంస్కృతికి ప్రతీక టర్శాక్ ఆధ్వర్యంలో ఈ చిత్రోత్సవాన్ని అక్టోబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అపూర్వ లతిక దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం "మిషన్ ఇస్తాంబుల్" ఆగస్టు నెలలో విడుదలైంది. ఈ చిత్రంలో జయేద్ ఖాన్, వివేక్ ఓబెరాయ్, శ్రియా శరణ్, షబీర్ అహ్లువాలియా, నికిటిని ధీర్ ప్రధాన తారాగణం కాగా శ్వేతా భరద్వాజ్ కొత్తగా పరిచయం అయారు. కాగా, సునీల్ షెట్టీ, అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు.
ఈ చిత్ర కథ ఉగ్రవాద నేపథ్యంలో కొనసాగుతుంది. తాను పనిచేస్తున్న ఇస్తాంబుల్ కేంద్రంగా నడిచే వార్తా ఛానెల్ వాస్తవానికి ఆప్ఘనిస్తాన్, భారత్లలో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంటోందని భారతీయ జర్నలిస్టు గ్రహిస్తాడు. తర్వాత అతడు ఈ ఉగ్రవాద సంస్థ పని పట్టడానికి టర్కిష్ కమాండోగా గతంలో పనిచేసిన ఓ మహిళ సహాయం తీసుకుంటాడు.
ఈ చిత్రోత్సవంలో ఆసియా తరపును ప్రదర్శించబడుతున్న ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల నుంచి పలు చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించబడనున్నాయి. కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ హస్త పతకాన్ని అందుకున్న ది క్లాస్, వూడీ అలెన్ నటించిన వికీ క్రిస్టినా బార్సెలోనా, చార్లీ కాఫ్మన్ తీసిన న్యూయార్క్ వంటి ప్రధాన చిత్రాలు కూడా ఇక్కడ పదర్శనకు వచ్చాయి.