1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రం!

వినోదం వెండితెర కథనాలు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రాలు
హాలీవుడ్, బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా మల్టీస్టారర్ చిత్రాలు నిర్మిస్తోంది. దీనికి ప్రధాన హీరోలు కూడా మందుకు రావడం విశేషం. తాజాగా "సవాల్" చిత్రాన్ని నిర్మించిన తోట వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్, శ్రీహరి, సురేష్‌లతో సాయిదివ్య క్రియేషన్స్ పతాకంపై మల్టీస్టారర్ చిత్రం నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

ఆ విశేషాలను వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తూ... నవంబర్ 1వ తేదీన ఘనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా మలయాళంలో బిజీ హీరోయిన్ అయిన మీరానంద్‌ తెలుగులో పరిచయం కాబోతుందన్నారు.

తమ బేనర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. సత్య ఈ సబ్జెక్ట్‌ను చక్కగా నెరేట్ చేశారని, మణిశర్మ సంగీతం, రైటర్ రత్నం, సర్వేష్ మురారి కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కథ... ఉదయ్ రాజ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... సత్య.
About Writer
SELVI.M