1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మతం కంటే మానవత్వం గొప్పదనే "అమృత"

వినోదం వెండితెర కథనాలు మతం మానవత్వం గొప్పది మై నేమ్ ఈజ్ అమృత భానుప్రియ భానుచందర్ బేబీ గాయత్రి కీర్తి ఆంథోనీ
WD

భానుప్రియ, భానుచందర్, బేబీ గాయత్రి, కీర్తి ప్రధాన తారాగణంగా.. ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ గౌని నిర్మిస్తున్న చిత్రం "మై నేమ్ ఈజ్ అమృత". ఆంథోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి రచయిత మురళి బోడపాటి మాట్లాడుతూ... సమాజంలోని ఓ ప్రధాన సమస్య చుట్టూ కథ తిరుగుతుందన్నారు.

మనుష్యుల్లో అణగారిపోతున్న మానవతా విలువలను కాపాడడానికి ఓ చిన్నారి చేసే ప్రయత్నమే ఈ చిత్రమని బోడపాటి చెప్పారు. మతం కంటే మానవత్వం గొప్పదని చాటే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తీస్తున్నామని ఆయన వివరించారు.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సందేశాత్మక చిత్రంగా "మై నేమ్ ఈజ్ అమృత" తెరకెక్కనుందని నిర్మాత వెల్లడించారు. జనవరి మొదటివారంలో ఆడియోను, మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు... రవీంద్ర సూరి, పాటలు... సూరిశెట్టి రామారావు, ఎడిటింగ్.. గౌతంరాజు, కెమేరా.. తోట వెంకటరమణ.
About Writer
SELVI.M