"హ్యాపీడేస్", "కొత్తబంగారులోకం" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ కథానాయకుడిగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
హిట్ చిత్రాల సంస్థ ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జనవరి 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. తమిళంలో సూపర్హిట్ అయిన ధనుష్ చిత్రం "పొల్లాదవన్" ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.
హీరో వరుణ్ సందేశ్కు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని నిర్మాత కిరణ్ అన్నారు. విభిన్న కథాంశంతో, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నామని ఆయన వెల్లడించారు.