నవదీప్, భూమిక, కిమ్శర్మ (ఖడ్గం ఫేమ్) హీరోహీరోయిన్లుగా పి.ఎ. అరుణ్ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "యాగం" అనే పేరును ఖరారు చేసినట్లు నిర్మాతలు రాజు, ప్రవీణ్ వెల్లడించారు.
జనవరిలో ఓ గీతాన్ని నవదీప్, భూమికలపై చిత్రించడంతో ఈ చిత్ర నిర్మాణం పూర్తవుతుందని, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్స్ దశలో ఉందని వారు తెలిపారు. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు.
FILE
చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ... నవదీప్కున్న ప్రేమకథా చిత్రాల ఇమేజ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్ను సంపాదించిపెట్టే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందన్నారు. నవదీప్ బ్యాంకాక్లోని రూరల్ ఏరియాలో ఓ బారులో పనిచేస్తుంటాడని, కిమ్శర్మ కూడా అక్కడే పనిచేస్తుంటుందని, భూమిక్ ఎయిర్హోస్టెస్గా ఈ సినిమాలో కన్పిస్తుందని దర్శకుడు తెలిపారు.
ఈ ముగ్గురి చుట్టే కథ నడుస్తుందని, ఇండియా, బ్యాంకాక్లలో జరిగే యాక్షన్ సన్నివేశాల సమ్మేళనం ఈ "యాగం" అని దర్శకుడు వివరించారు. పాటలకు పరిమితమై అందంగా కనబడే బ్యాంకాక్ ప్రాంతాన్ని ఈ చిత్రంలో కొత్తకోణంలో చూడబోతున్నారని ఆయన వెల్లడించారు.
భూమిక పాత్ర కీలకమైందని, హిందూ పురోహితునిగా అలీ కన్పిస్తారని దర్శకుడు చెప్పారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. పి.ఎ. అరుణ్ప్రసాద్, సమర్పణ... భరత్ ఠాకూర్, నిర్మాణం... సిల్వర్ స్క్రీన్ మూవీస్.