నితిన్, ప్రియమణి జంటగా, కరుణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్లీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాలో యాక్షన్ హీరోగా నితిన్ మరో కొత్త కోణంలో కన్పించగా, ప్రియమణి తన గ్లామర్తో ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్ర ఆడియో త్వరలో సుప్రీం ద్వారా విడుదల కానుంది.