"మస్త్" ఆడియో ప్రీమియర్ విడుదల
|
జీ మోహన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న తెలుగు చిత్రం "మస్త్". శివాజీ, శివబాలాజీ, అర్చన, ముఖుల్ దేవ్, డా. బ్రహ్మానందం, అలీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ చిత్రంలోని పాటలను సరిగమ మ్యూజిక్ కంపెనీ ద్వారా త్వరలో విడుదల చేయనున్నారు.
ముందుగా ఈ పాటల ప్రీమియర్ను రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రహీరో శివాజీ, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి హాజరయ్యారు. తొలిసారిగా ఆడియో ప్రీమియర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కొత్తదనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీ-ఎ.పి హెడ్ సంజయ్ రెడ్డి, శివానంద తదితరులు పాల్గొన్నారు.