బాలయ్య ఎడ్లబండి తోలిన వేళ...!
|
ఇందులో బాలకృష్ణ విదేశాల నుంచి తన పుట్టిన గడ్డకు వచ్చే సన్నివేశాన్ని గోదావరి తీరాన చిత్రించారు. ఎడ్లబండిపై వస్తూ ప్రకృతి అందాలకు పరవశించి ఓ పాటను పాడుతున్న సన్నివేశాన్ని అక్కడ చిత్రించారు. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై...ఇదే ప్రాంతంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... తన నిర్మాణంలో వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. చక్కటి విందు భోజనం లాంటి కథ ఇదన్నారు. బాలయ్య అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రముంటుందని నిర్మాత తెలిపారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి కథ... విజయేంద్రప్రసాద్, మాటలు...ఎం. రత్నం, కెమేరా... బాలమురుగన్, పాటలు... వేటూరి, అనంతశ్రీరామ్, వెన్నెలకంటి.