1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కలవరమాయే మదిలో" అంటోన్న కలర్స్ స్వాతి

వినోదం వెండితెర కథనాలు కలవరమాయే మది కలర్స్ స్వాతి మోహన్వడ్లపట్ల అష్టాచమ్మా మహేష్ బాబు అభిమాని సతీష్ కాసెట్టి
WD
"అష్టాచమ్మా"లో మహేష్ బాబు అభిమానిగా నటించిన కలర్స్ స్వాతి ద్వితీయ ప్రయత్నంగా "కలవరమాయే మదిలో" అంటూ ముందుకు వస్తోంది. మోహన్‌వడ్లపట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి "హోప్" దర్శకుడు సతీష్ కాసెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. స్వాతి అనే అమ్మాయి కథే ఈ చిత్రమని, సింగర్ అవ్వాలనేది ఆమె కలని, కానీ మధ్యలో ఓ యువకుడు వచ్చి ఆమె మదిని కలవరపెడుతుంటాడని చెప్పారు. మొత్తానికి ఆమె కల నెరవేరిందా? లేదా? అనేదే చిత్రమని దర్శకుడు వివరించాడు. ఈ కథ దిల్‌రాజుకు తెలుసునని, అందుకే తన వద్ద ఉన్న చక్కని టైటిల్‌ను తన చిత్రానికి ఇచ్చారని చెప్పారు.

ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుందని, ఏకధాటిగా సాగే షూటింగ్‌తో రెండు నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేస్తామని సతీష్ కాసెట్టి అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారని చెప్పారు. ఇందులో పది చక్కని పాటలుంటాయని, సంగీత నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాత వెల్లడించారు.
About Writer
SELVI.M