సంగీతనేపథ్యంలో "కలవరమాయె మదిలో"
|
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్ వరకు జరిగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని నిర్మాత చెప్పారు. తమ బేనర్లో ఇది ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
కథపై పూర్తి తమకు నమ్మకముందని, ఈ చిత్రం ద్వారా కెమేరామెన్ రాజేంద్ర, సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్, నటుడు విక్రమ్ గోఖలేలు కొత్తగా పరిచయమవుతున్నారని నిర్మాత వెల్లడించారు. మంచికథాంశంతో "కలవరమాయెమదిలో" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశించారు.