1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రేపు నంది అవార్డుల ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డులు విక్టరీ వెంకటేష్ కృష్ణవంశీ హైదరాబాద్ లలిత కళాతోరణం
FileFILE
ప్రతియేడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరుగనుంది. హైదరాబాద్‌లోని శ్రీలలిత కళాతోరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవార్డులను రాష్ట్ర చలనచిత్ర, టి.వి, నాటకరంగ అభివృద్ధి సంస్థ గత నెలలో ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ ముఖ్య అతిథిగా హాజరై, అవార్డును ప్రదానం చేస్తారు. ఇందులో 2007 సంవత్సరానికి గాను ఎంపికైన చిత్రాలకు, నటీనటులకు అందజేస్తారు.

ఉత్తమ చిత్రంగా 'మీ శ్రేయోభిలాషి', ద్వితీయ ఉత్తమ చిత్రంగా 'హ్యాపీడేస్‌', తృతీయ ఉత్తమ చిత్రంగా 'లక్ష్యం', ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా 'చందమామ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాలు ఎంపికయ్యాయి. అలాగే ఉత్తమ నటుడుగా విక్టరీ వెంకటేష్ (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే), ఉత్తమ దర్శకుడుగా కృష్ణవంశీ (చందమామ), ఉత్తమ నటిగా ఛార్మి (మంత్ర)లు ఎంపికయ్యారు.

అలాగే ఉత్తమ సహాయ నటుడు అవార్డును జగపతి బాబు (లక్ష్యం), ఉత్తమ సహాయ నటిగా శ్రీమతి జానకి (అమూల్యం), ఉత్తమ క్యారెక్టర్‌ నటుడుగా ఆహుతి ప్రసాద్‌ (చందమామ), ఉత్తమ హాస్య నటుడుగా ఉత్తేజ్‌ (చందమామ), ఉత్తమ హాస్యనటి అవార్డును ఝాన్సీ (తులసి), ఉత్తమ విలన్‌గా మురళీశర్మ (అతిథి)లు అవార్డులు అందుకోనున్నారు. అలాగే వివిధ విభాగాల్లో పలువురు నటీనటులు అవార్డులు అందుకోనున్నారు.
About Writer
PNR