యూనివర్శల్ మీడియా పతాకంపై సిద్ధార్థ కథానాయకుడిగా షామిలీ (బేబీ షామిలీ) హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం "ఓయ్". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు.. విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ శిష్యుడు ఆనంద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.