1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అర్జున్-సాయికుమార్‌ల "జై సాంబశివ"

వినోదం వెండితెర కథనాలు అర్జున్ సాయికుమార్ జై సాంబశివ సాయిబాలాజీ పేరరసు
PTI
తమిళంలో విజయం సాధించిన "తిరువణ్ణామలై" చిత్రం తెలుగులో "జై సాంబశివ" అనే పేరుతో అనువాదమౌతోంది. యాక్షన్ హీరో అర్జున్ ద్విపాత్రాభినయంలో, సాయిబాలాజీ ఫిలింస్ పతాకంపై.. గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పేరరసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయికగా పూజాగాంధీ, విలన్‌గా సాయికుమార్ నటించారు.

ఈ చిత్రం గురించి నిర్మాతలు చెబుతూ.. కొడుకు దుడుకుతనానికి కళ్ళెం వేయాలని అర్జున్‌ను గుడిపూజారి సలహా మేరకు ఓ శైవక్షేత్రం తీసుకువెళుతుంది. అయితే అక్కడేమి జరిగింది? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందన్నారు.

ఈ చిత్రంలో ఆరు పాటలు, ఏడు ఫైట్లు ఉన్నాయని, ముఖ్యంగా అర్జున్, సాయికుమార్‌లపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరుకల్లా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

సుధ, కరుణాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు.. ఘంటసాల రత్నకుమార్, పాటలు.. భువనచంద్ర, సాహితీ, సంగీతం.. శ్రీకాంత్ దేవా, సహనిర్మాత.. పి. చంద్రశేఖర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. పేరరసు.
About Writer
SELVI.M