31న ప్రభాస్-పూరి జగన్నాథ్ల కొత్త చిత్రం!
|
ఈ చిత్రం గురించి డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చెబుతూ.. ప్రభాస్తో చేస్తున్న మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదన్నారు. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పవర్ ఫుల్ సబ్జెక్ట్తో రూపొందుతోన్న స్టైలిష్ ఫిలిమ్ ఇదని పూరి వివరించారు. జూలై నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఆదిత్యరామ్ పతాకంపై తన సమర్పణలో ఈ చిత్రం తయారవుతుందని పూరి అన్నారు.
యంగ్రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా నటిస్తోన్న ఈ భారీ చిత్రానికి సమర్పణ.. పూరి జగన్నాథ్, నిర్మాత.. ఆదిత్యారామ్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం.. పూరి జగన్నాథ్.