1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఐశ్వర్యాను కాదని కత్రినా బార్బీగా రానుంది

వెండితెర కథనాలు ఐశ్వర్యా కత్రినా కైఫ్ బార్బీ ప్రముఖ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ బాలీవుడ్ బార్బీ అర్ధ శత జయంత్యుత్సవాలు ల్యాక్మే ఫ్యాషన్ వీక్
తొలిసారిగా ప్రముఖ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను కాదని ప్రస్తుతం ప్రముఖ నటి కత్రినా కైఫ్ బార్బీగా రానుంది. ఇప్పుడు భారతదేశంలో కత్రినా బార్బీ రూపంలో రానుంది.

ఇదివరకు ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బార్బీ రూపంలో రానుందని వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం కత్రినాను ఎన్నుకోవటంతో దీంతో వారిరువురి మధ్య మంచి రసవత్తరమైన పోటీ ఏర్పడనుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

శుక్రవారం ల్యాక్‌మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా బార్బీ అర్ధ శత జయంత్యుత్సవాలను జరుపనున్నారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బార్బీ అవతారం ఎత్తనుంది.

ఇదిలావుండగా ఇరవైనాలుగు సంవత్సరాల కైట్ ప్రస్తుతం హాలీవుడ్ సూపర్ స్టార్ లీజ్ హల్రీ, షకీరా ఎలిజబెత్ టేలర్, డైనా రాస్‌ల గ్రూప్లో చేరిపోయారు. కాగా బార్బీ యాభై సంవత్సరాల ప్రయాణంలో కత్రినా కైఫ్ తొలి భారతీయ నటి కావడం గమనార్హం. ఇలాంటి గౌరవం తనకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని కైట్ తెలిపారు.
About Writer
Gulzar Ghouse