Paruchuri Drama festival in Vizag | వైజాగ్లో పరుచూరి నాటకోత్సవాలు
పరుచూరి రఘుబాబు 19వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1వరకు విశాఖపట్నంలో జరుగుతాయని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రదర్శించిన నాటికనాటకాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు 14 నాటికలు, 8 నాటకాలను ఎంపికచేసినట్లు పేర్కొన్నారు.
మే 1వ తేదీన జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో డి. రామానాయుడు, సి. నారాయణ రెడ్డితో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు పరుచూరి తెలిపారు. ఈ నాటకోత్సవాలను వైజాగ్కు చెందిన వెలుగోడి ట్రస్ట్, శ్రీ మిత్ర రియల్ ఎస్టేట్ సంస్థలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తమ నాటికలు, నాటకాలను హైదరాబాద్ నాటక ప్రియులుకూడా చూసేందుకు రఘుబాబు వర్థంతి సెప్టెంబర్ 6న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పేర్రొన్నారు.
ఈ విషయమై నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినీ రంగానికి వంతెనలా ఏర్పడి ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చిన పరిషత్ను అభినందించారు.
మే 1వ తేదీన జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో డి. రామానాయుడు, సి. నారాయణ రెడ్డితో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు పరుచూరి తెలిపారు. ఈ నాటకోత్సవాలను వైజాగ్కు చెందిన వెలుగోడి ట్రస్ట్, శ్రీ మిత్ర రియల్ ఎస్టేట్ సంస్థలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తమ నాటికలు, నాటకాలను హైదరాబాద్ నాటక ప్రియులుకూడా చూసేందుకు రఘుబాబు వర్థంతి సెప్టెంబర్ 6న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పేర్రొన్నారు.
ఈ విషయమై నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినీ రంగానికి వంతెనలా ఏర్పడి ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చిన పరిషత్ను అభినందించారు.