1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మిత్రుడు"

సుదీర్ఘ కాలం బాలకృష్ణ మిత్రుడు రాష్ట్రం థియేటర్ ధ్వంసం రాళ్ళ వర్షం
FileFILE
సుదీర్ఘ కాలం తర్వాత యువరత్న బాలకృష్ణ నటించిన "మిత్రుడు" చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదల కారణంగా రాష్ట్రంలో పలు థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు రగడ సృష్టించారు.

హైదరాబాద్‌ పంజాగుట్ట సెంట్రల్‌లోని పీవీఆర్‌ థియేటర్‌లో సాంకేతిక కారణాల వల్ల బాలకృష్ణ నటించిన "మిత్రుడు" చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులు ఆందోళనకు దింగారు. థియేటర్‌పై రాళ్ల వర్షం కురిపించారు.

థియేటర్‌ యాజమాన్యం కావాలనే ఉద్దేశపూర్వకంగానే చిత్ర ప్రదర్శనను నిలిపివేసిందని ఆరోపిస్తూ అభిమానులు థియేటర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులకు నచ్చజెప్పి బయటకు పంపేశారు. అలాగే చిత్తూరు జిల్లాలోనూ అభిమానులు ఆగ్రహం చెందారు.
About Writer
PNR